20 June, 2026 | 8:41 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి అంతంపల్లి వాసి మృతి

04-11-2024 10:46 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే... కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన జీడి సిద్దయ్య(58) ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడ్డాడు. ఈ ప్రమాదంలో సిద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని సిద్ధయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సిద్దయ్య అంతంపల్లి నుంచి బిక్కనూరులో రైలు ఎక్కి తన సోదరుని ఇంటికి  వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.