17 April, 2026 | 11:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మల్కాజిగిరిలో అనుకృష్ణ ఆసుపత్రి సీజ్

08-04-2025 12:44 AM
  1. రూ.5 లక్షల జరిమానా 
  2. యాజమాన్యంపై కేసు నమోదు 

మేడ్చల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మల్కాజిగి రిలోని అను కృష్ణ ఆస్పత్రి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సోమవారం కలెక్టర్ గౌతమ్ ఆదేశాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి .ఉమా గౌరీ ఆధ్వర్యంలో ఆస్పత్రిని తనిఖీ చేయగా విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. పిసి పిఎన్డిటి సర్టిఫికెట్ గడువు ముగిసినప్పటికీ కొత్తది తీసుకోకపోవడం, డాక్టర్ల అర్హత తప్పుగా చూపించి రోగులను మోసం చేయడం, అనధికారికంగా అల్ట్రా సౌండ్ యంత్రాన్ని వినియోగించడం వంటివి బయటపడ్డాయి.

అంతేగాక పారామెడికల్ సిబ్బందికి లైసెన్స్ లేకపోవడం, పాలి క్లినిక్ లో అనధికార వైద్య ప్రాక్టీస్ వంటివి గుర్తించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యానికి రూ. ఐదు లక్షల జరిమానా విధించారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ 60 రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేశారు.

యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అన్ని వైద్య పరికరాలు, డయాగ్నొస్టిక్ ఉపకరణాలు జప్తు చేశారు. తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా గత నెలలోనూ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో కూడా లోపాలు బయటపడ్డాయి. స్కానింగ్ మిషన్ ను సీజ్ చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి నిర్వహణలో మార్పు రాలేదు.