calender_icon.png 25 June, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపునకు ‘అనురాగ్’ విద్యార్థులు

25-06-2025 01:34:11 AM

ఘట్కేసర్, జూన్ 24 : పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఐదుగురు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గుజరాత్లోని వల్సాద్లో ఈనెల జూన్ 27వతేదీ నుండి జూలై 3 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (ఎన్‌ఐసి) కోసం ఎంపికయ్యారు.శ్రీసద్గురుధామ్, బారుమల్, ధరంపూర్ లలో నిర్వహించబడే ఈ శిబిరంలో దేశం నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొంటారు.

అనురాగ్ విశ్వవిద్యాలయం నుండి ఎంపికైన వాలంటీర్లు ఎస్. చందన (బి ఫార్మా 4వసంవత్సరం), జి. ప్రణయ్ (ఈసిఈ 4వసం వత్సరం),కె. మౌల్యశ్రీ (సిఎస్‌ఈ సిఈ 3వసంవత్సరం),గోపు కార్తీక్ (సిఎస్‌ఈ డీఎస్ 4వసంవత్సరం),వి. దిలీప్ (సిఎస్‌ఈ 4వసంవత్సరం) వీరితో పాటు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్ టియుహెచ్) నుండి ఐదుగురు వాలంటీర్లు కూడా ఈక్యాంప్లో పాల్గొననున్నారు.

ఈవిద్యార్థుల బృందం జూన్ 25న గుజరాత్కు బయలుదేరుతుంది.ఈసందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, ఎంపికైన విద్యార్థులను అభినందించారు.