17 April, 2026 | 11:55 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బోనాలకు పక్కగా ఏర్పాట్లు

25-06-2025 01:32 AM

-కార్వాన్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ 

కార్వాన్, జూన్ 24: బోనాల పండుగకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని కార్వాన్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ తెలిపారు. మంగళవారం ఆమె గోల్కొండ జగదాంబికా ఆలయ ట్రస్టీ కమిటీ చైర్మన్ చంటిబాబు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేయనున్న మంత్రుల స్వాగత సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించారు.

అక్కడ పైప్ లైన్ పనులు జరగడంతో మ్యాచ్ వర్కులు పూర్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగుల పల్లి శ్రీకాంత్, సంతోష్ గౌడ్, ఆకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.