08-03-2025 11:10:03 AM
మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు.. ఇది సమాజ బాధ్యత.
తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు నా శుభాకాంక్షలు.
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) జరుపుకోవడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని తల్లులు, సోదరీమణులతో పోలుస్తూ ఆయన అందరు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందన్నారు.
మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్(Andhra Pradesh Budget 2025-26)లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ. 4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశామని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నామన్న సీబీఎన్ మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ... మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అంటూ చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు.