09-05-2025 12:36:59 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే8( విజయ క్రాంతి): పత్రిక స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కాల రాస్తుందని జర్నలిస్టులు మండి పడ్డారు. గురువారం సాక్షి ఎడిటర్ ధనుం జయ రెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ దాడు లను నిరసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలి పారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలి స్టు లు మాట్లాడుతూ ఏపీప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులకు, సాక్షి ఎడిటర్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి జిల్లా ప్రతినిధి రామ్మోహన్, శ్రీనివాస రావు, సురేష్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.