15 March, 2026 | 11:28 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

16న విచారణకు హాజరుకావాలి

25-09-2024 12:36 AM

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఓటుకు నోటు కేసులో అక్టోబర్ ౧6న నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. ఈ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డితో సహా మిగిలిన నిందితులందరూ హజరుకావాలని నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశించింది.

మంగళవారం ఈ విచారణకు మత్తయ్య మినహా ఈ కేసులో ఏఛొ1 నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. వీరి గైర్హాజరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

అయితే మంగళవారం జరిగిన విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిందితుల తరఫు నుంచి వచ్చిన అభ్యర్థనను అంగీకరించిన కోర్టు అక్టోబర్ 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ ఆదేశాలు జారీచేసింది.