10-05-2025 12:55:36 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, మే 9 (విజయ క్రాంతి): ఈ నెల 17 లోపు లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని, మే 5 నుంచి మీ సేవా కేంద్రాలలో 100 రూపాయలు చెల్లించి దరఖాస్తు, ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మే 17 లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు లను మీసేవ కేంద్రాల్లోని సమర్పించాలని కోరారు.
ఇంటర్ లో గణితం లో 60 శాతం మార్పులు సాధించిన వారు, ఐటిఐ డ్రాఫట్స్ మెన్(సివిల్) , డిప్లమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలలో (మే 26 నుంచి జూలై 26 ) శిక్షణ ఇస్తామని, శిక్షణ కోసం ఓసి అభ్యర్థులు పదివేల రూపాయలు, బీసీ అభ్యర్థులు 5000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని , మరిన్ని వివరాలకు 9849081489, 7032634404, 9441947339 ఫోన్ నెంబర్ల నందు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.