20-02-2026 02:00:50 AM
మేడ్చల్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ మేడ్చల్ - మల్కాజిగిరిజిల్లా ఆధ్వర్యంలో మైనారిటీ యువత ( ముస్లిములు, క్రిసియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు )కు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ లలో శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ తెలిపారు. ఈ శిక్షణను జిల్లాలోని మైనార్టీ యువత ఉపయోగించుకొని వివిధ ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి సంబంధిత సమాచారం పొందవచ్చునన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు విద్యా అర్హత పత్రాలతో సంబంధిత కార్యాలయంలో గానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గానీ, ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేదా జిల్లా మైనారటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్నీ లేదా ఫోన్ నెం: 9849204476/9000168256, 7569391754, 9000641911 కు సంప్రదించ వలసినదిగా ఆమె సూచించారు. అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్, ఆదాయ ద్రువీకరణ పత్రం రూ.2 లక్షలు వరకు, జిల్లా వాస్తవ్యులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్నారు.