15 April, 2026 | 12:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

20-02-2026 02:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ మేడ్చల్ - మల్కాజిగిరిజిల్లా ఆధ్వర్యంలో  మైనారిటీ యువత ( ముస్లిములు, క్రిసియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు )కు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ లలో శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ తెలిపారు. ఈ శిక్షణను జిల్లాలోని మైనార్టీ యువత ఉపయోగించుకొని వివిధ ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి సంబంధిత సమాచారం పొందవచ్చునన్నారు. 

ఆసక్తిగల అభ్యర్థులు విద్యా అర్హత పత్రాలతో సంబంధిత కార్యాలయంలో గానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గానీ, ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేదా జిల్లా మైనారటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్నీ లేదా ఫోన్ నెం:  9849204476/9000168256, 7569391754, 9000641911 కు సంప్రదించ వలసినదిగా ఆమె సూచించారు. అభ్యర్థులు పదో తరగతి లేదా ఇంటర్, ఆదాయ ద్రువీకరణ పత్రం రూ.2 లక్షలు వరకు, జిల్లా వాస్తవ్యులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్నారు.