13-06-2025 11:53:37 PM
చదువు అనే ఆయుధంతో దేనినైనా సాధించవచ్చు
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజు ఉదయం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వ కార్యక్రమం అయిన బడి బాటలో భాగంగా దేవాదులలో నిర్వహించిన సామూహిక అక్షరాబ్యాసానికి ముఖ్య అతిధిగా కన్నాయిగూడెం ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ పాల్గొని బడిలో క్రొత్తగా చేరే నూతన విద్యార్థులకి పలకలు పంపిణీ చేసి,అక్షరాబ్యాసం చేయించారు. స్థానిక ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల దేవాలయం లాంటిదని భవిష్యత్ లో చదువు అనే ఆయుధంతో దేనినైనా సాధించవచ్చు,అలాంటి విద్యకు మొదటి అక్షరాబ్యాసాని నన్ను ఆహ్వానించి, ఉపాధ్యాయులు సమక్షంలో దేవాదుల స్కూల్ లోని ఈ చిన్నారులతో అక్షరాబ్యాసాని చేయించడం సంతోషంగా భావిస్తున్నాము.