16 March, 2026 | 9:55 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

మెరిట్ స్కాలర్షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోండి

24-04-2025 12:11 AM

ఇల్లెందు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా జి.ఎం. కార్యాల యంలో బుధవారం  ఏర్పాటుచేసిన సమావేశంలో ఏరియా జి.యం. వి.కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో పనిచేస్తున్న అధికారులు  మరియు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25  విద్యా సంవత్సరానికి గాను మెరిట్ స్కాలర్షిప్ కొరకు  ధరఖాస్తు చేసుకోవాలని తెలి పారు.ఉద్యోగుల పిల్లలు NEET/ EAMC ET&NIT(JEE- Mains)/AIIMS/BITSAT ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, సంబంధిత విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన వారికి సింగరేణి సంస్థచే ప్రతి విద్యా సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ పొందుట కొరకై ఉద్యోగులు సంబంధిత గని/ విభాగాలలో దరఖాస్తు తో పాటు ర్యాంక్ కార్డు, అలాట్మెం ట్ ఆర్డర్, అడ్మిషన్ కార్డు, ఫీజు చెల్లించిన రశీదు జతపరిచి అందజేయగలరని తెలిపారు.  EAMCET/NEET లో ర్యాంక్ 2000 టు 8000 లోపు ఉన్న వారే అర్హులన్నారు.