calender_icon.png 16 June, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోండి

15-06-2025 07:05:41 PM

మండల వ్యవసాయ అధికారిని అంజనీదేవి...

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా పథకం వానాకాలం 2025 సంవత్సరానికి గాను రైతులు ఎవరైతే పట్టా పాసుబుక్ జూలై 5, 2025 లోపు వచ్చిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అంజనీదేవి(Mandal Agriculture Officer Anjani Devi) రైతులను కోరారు. గతంలోను పట్టా పాసుబుక్ ఉండి దరఖాస్తు చేసుకోని రైతులు ఉన్నట్లయితే సంబంధిత క్లస్టర్ ఏఈఓ లకు ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు రైతు భరోసా అప్లికేషన్ తో పాటు భూమి పాసుబుక్ జీరాక్స్, ఆధార్ జీరాక్స్ మరియు బ్యాంకు పాసుబుక్ జీరాక్స్ ఇవ్వవలిసిందిగా తెలిపారు.