15-06-2025 07:07:59 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్(District Badminton Association) ఆధ్వర్యంలో జూన్ 14, 15 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బాడ్మింటన్ (మెన్ సింగిల్స్) క్రీడల్లో ఇదే జిల్లా ఇనుగుర్తికి పీ.రవివర్మ ప్రథమ స్థానం సాధించారు. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ రైల్వేస్ క్లబ్ లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో రవివర్మ పాల్గొంటారని మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రవి వర్మ సౌత్ జోన్ జాతీయ స్థాయిలో రెండు సార్లు కాకతీయ యూనివర్సిటీ నుండి పాల్గొని ప్రతిభ కనపరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన రవి వర్మను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొమ్ము రాజేందర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సయ్య , డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, జాయింట్ సెక్రటరీ సాంబమూర్తి, కొప్పుల శంకర్ అభినందించారు.