30-06-2025 01:42:24 AM
కరీంనగర్, జూన్ 29 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం లో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఉన్నత విద్యా మండలి శాతవాహన విశ్వవిద్యాలయ పరిధి లో మొత్తం 36060 సీట్లకు గాను మొదటి, రెండవ విడతలో 9455 సీట్లను కేటాయించగా, 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకున్నారు. ఇంకా 29330 సీట్లు ఖాళీగా ఉండగా మూడో విడతలో 7629 సీట్లను కేటాయించింది.
మూడో విడతలో 13 ప్రభుత్వ కళాశాలలో 1060 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది.60 ప్రైవేటు కళాశాలలో 5523 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది.
మూడో విడతలో సీట్లు పొందిన వి ద్యార్థులు జూలై 1 లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోవాలని లేని పక్షంలో సీటు రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని, దోస్త్ కోఆర్డినేటర్ డా. శ్రీరంగ ప్రసాద్ తెలియచేశారు.