02-06-2025 02:18:34 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన త ర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కో సం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెం చేందుకు ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కళింగభవన్లో బీసీ సంక్షేమ సంఘం కార్యని ర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జాజుల శ్రీనివాస్గౌడ్ మా ట్లాడుతూ.. బీసీ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేప డతామని ప్రకటించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పిస్తేనే బీసీలు కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వసిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపి ఇప్పటికే రెండు నెలలు కావొస్తున్న ఇప్పటికీ అతిగతి లేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి పెంచి బీసీ రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పం దించకపోతే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జూలై రెండోవారంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
త్వరలోనే తమిళనాడు, బీహార్, గోవా, యూపీ రాష్ట్రాలు పర్యటించి కులగణన అమలుచేసే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా చైతన్యం చేయడానికి జూన్, జూలై రెండు నెలల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలు పర్యటిస్తామని పేర్కొన్నారు. బీసీల పోరాటాన్ని రాజకీయ పోరాటంగా మార్చి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారం దక్కేలా కృషి చేస్తామని చెప్పారు.
సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. సమావేశంలో బీసీ నాయకులు కుం దారం గణేష్చారి, బాలగోని బాలరాజుగౌడ్, విక్రమ్గౌడ్, కనకాల శ్యామ్, భాగయ్య, హను మాన్లు, మహేశ్యాదవ్, వేణుమాధవ్, శేఖర్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, తారకేశ్వరి, రమ, వరంగల్ శ్రీనివాస్, సుధాకర్, దత్తు, కనకయ్యగౌడ్, నరసింహ, సోమ మల్లయ్య, దాడి మల్లయ్యయాదవ్, జగన్నాథం, గోపి, రవీందర్ పాల్గొన్నారు.