12-06-2025 12:56:53 AM
ఉమ్మడి జిల్లాలో అదే తీరు
ట్రాన్స్ పోర్ట్ అధికారులు హెచ్చరిస్తున్నా ఫిట్నెస్ పూర్తికాని బస్సులు
నేడే పాఠశాలల ప్రారంభం
అరకొర వసతుల మధ్య
పాఠశాలలు పున: ప్రారంభం
కామారెడ్డి, జూన్ 11 (విజయ క్రాంతి), జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పున: ప్రారంభానికి చర్యలు తీసు కు0ది, ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభిస్తారు. ప్రతి ఏటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలుతీరు మారడం లేదు. కామారెడ్డి జిల్లాలో ప్రవేట్ పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన ప్రైవేట్ బస్సులు 251 వరకు ఉన్నాయి.
ప్రతిరోజు పాఠశాలలకు విద్యార్థులను ప్రైవేటు బస్సుల ద్వారా తీసుకువస్తారు. ఆ బస్సులను ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం కంటే ముందు ఫిట్నెస్ చేయించుకోవాలి. రవాణా శాఖ అధికారులు ప్రతి సంవత్సరం ముందుగానే ఫిట్నెస్ చేసుకోవాలని ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలకు సూచిస్తున్న వారు పట్టించుకోవడం లేదు. ఆధార బదరగా చివరి సమయంలో ఫిట్నెస్కు బస్సులను తెచ్చి ఫిట్నెస్ చేయించాము అని చేతులు దులుపుకుంటున్నారు.
స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు తక్కువ వేతనాలు ఇవ్వడంతో సరైన నైపుణ్యతలేని వారిని నియమించి ప్రమాదాల ను కొని తెచ్చుకుంటున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాఠశాల యజమాన్యాలు బస్సు సౌకర్యం కల్పిస్తామని గొప్పలు చెబుతూ డొక్కు బస్సులతో కాలం చెల్లిన బస్సులతో విద్యార్థులను పాఠశాలలకు చేరవేస్తున్నారు.
ప్రతి విద్యా సంవత్సరం కంటే 20 రోజుల ముందే బస్సులను ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉండగా ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారులు పదే పదే చెప్పడమే కాకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల యజమానుల లో మాత్రం మార్పు రావడం లేదు. అలాగే పాఠశాలల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంటున్నాయి.
ఒకవైపు ప్రభుత్వం ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతా మని గొప్పలు చెప్తున్నా ఆచరణలో మాత్రం పాటించడం లేదు. గత ప్రభుత్వ హాయంలో మా ఊరు మా బడి పేరుతో కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మాత్రం పోతి కాకుండానే నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులు చేసి నిలిపివేశారు.
ఆ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి ఫర్నిచర్ ను ల్యాబ్ పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా కొన్ని పాఠశాలలో ఏర్పాటుచేసి చేతులు దులుపుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వ పాఠశాలల తీరును మారుస్తామని పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా ఇప్పటికి పాఠశాలల్లో వసతులు మాత్రం సమ కూర్చడం లేదు.
పేద విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండడంతో పాఠశాలల అభివృద్ధిపై మౌలికవాసతుల కల్పనపై ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలసత్వం డబ్బున్న వారు ఉద్యోగులు, ధనిక వర్గాల వారు తమ పిల్లలను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస ఉపాధ్యాయులు కూడా ఉండడం లేదు.
శిథిలావస్థలో పాఠశాలలు వసతి గృహాలు
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల పరిస్థితి శిథిలావస్థత కొట్టుమిట్టాడుతున్నాయి. కూడా అదే విధంగా ఉన్నాయి. వర్షం వచ్చిందంటే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల పరిస్థితి మారడం లేదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి నెలకొని ఉంది.
ప్రైవేట్ , ప్రభుత్వపాఠశాలలు, కళాశాలలో పరిస్థితి అంతే డబ్బులు పెట్టి చదివించాలని తల్లిదండ్రులు భావిస్తూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులను చేర్పిస్తున్నారు. వారికి కూడా కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. ఫీజులు మాత్రం లక్షలు, వేలల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ యజమాన్యాలు విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. సంఘటనలు జరిగినప్పుడే స్పందిస్తున్నారు తప్ప పాఠశాలల ప్రారంభం కంటే ముందే పాఠశాలలను కళాశాలలో సందర్శించడం లేదు. కనీస వసతులు ఉన్నాయా లేవా అని అధికారులు చూడడం లేదు. ప్రతి సంవత్సరం మొక్కు బడిగా తనిఖీలు నిర్వహించి మామా అనిపిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు కూడా నడిపిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో పాఠశాల లు, కళాశాలల యజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో 1200 ప్రభుత్వ పాఠశాలలు 600 కు కు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు డిప్యూటీ అధికారులు పర్యవేక్షణ ను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్నిచర్ కొరతతో పాటు తరగతి గదుల తలుపులు కిటికీల తలుపులు, శిథిలావస్థకు చేరుకున్నాయి.
వాటి మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా మొక్కుబడి మరమ్మతులతో చేతులు దులుపుకుంటున్నారు. అవసరమైన నిధులు లేకపోవడం వల్లే పూర్తిస్థాయిలో మరమత్తులు చేపట్టడం లేదంటూ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లా పరిస్థితి అదే విధంగా ఉంది. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో చేరెందుకు విద్యార్థులు జంకుతున్నారు.
ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాం
కామారెడ్డి జిల్లాలో 1200 కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల లు ఉన్నాయి. వేసవి సెలవులలో మౌలిక వసతులు కల్పించాం. కొన్ని పాఠశాలలకు నిధులు రాకపోవడంతో పనులు పూర్తికాలేదు. మా ఊరు మా బడి కింద నిధులు మంజూరైన పనులు పూర్తికాలేదు.
ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదు. కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపివేశారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి ఫిట్నెస్ లెనీ బస్సులను సీజ్ చేయాలి
కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కలశాలలకు చెందిన ప్రైవేట్ బస్సులను ఫిట్నెస్ చేయించడం లేదు. అనుకోని కారణాలవల్ల విద్యార్థులకు అపాయం జరిగే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం 70% వరకే పాఠశాల బస్సులను ఫిట్నెస్ చేస్తున్నారు. ఫిట్నెస్ చేయించకుండా బస్సులు నడిపితే రవాణాశాఖ అధికారులు సీజ్ చేయాలి. లేకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రవీందర్ గౌడ్, విద్యార్థి సంఘం నేత కామారెడ్డి