12-06-2025 01:00:17 AM
మండల విద్యాశాఖ అధికారి యూసఫ్ నేడు పాఠశాలలు పున: ప్రారంభం
సదాశివనగర్,జూన్ 11(విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా సదాశివరులో గురువారం పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పాఠశాలలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మండల విద్యాశాఖ అధికారి యూసఫ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు,నాణ్యమైన విద్య, మంచి భోజనం, పరిశుభ్రత పాటించే విధంగా ప్రభుత్వం చేపట్టిందన్నారు. పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రతపై వీడియోగ్రఫీ,ఫోటోగ్రఫీ ద్వారా అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రతంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మోడల్స్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.