15 June, 2026 | 2:57 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

పదవులేనా? ప్రజా సంక్షేమం వద్దా!

16-06-2024 01:15 AM
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తీరుపై బీజేపీ నాయకురాలు శ్రావణి ఫైర్

జగిత్యాల, జూన్ 15 (విజయక్రాంతి): మీకు పదవులేనా? ప్రజా సంక్షేమం వద్దా అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రశ్నించారు. జగిత్యాలలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు? ఎందరికి ఉపాధి కల్పించారన్నారు. నియోజకవర్గంలో 4,520 మందికి మంజూరైన డబుల్ బె డ్రూం ఇళ్లను మంజూరు చేయకుండా తమ వర్గానికే  మేలు చేస్తున్నారని ఆరోపించారు.  జగిత్యాలలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ చూపడంలేదని నిలదీశారు. సమావేశంలో రూరల్ మండలాధ్యక్షుడు తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదరిలు ఆము ద రాజు, సిరికొండ రాజన్న పాల్గొన్నారు.