calender_icon.png 1 January, 2026 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోలీసులు సంసిద్ధంగా ఉండాలి

01-01-2026 01:26:28 AM

క్రమశిక్షణతోపాటు నిజాయితీ తప్పనిసరి

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి):  సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి కేటాయించిన కిట్ ను పరిశీలించి వారికి సంబంధించిన ఆర్టికల్స్ ను వారికి అందజేయాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఉన్న మోటార్ వెహికల్ అధికారి కార్యాలయాన్ని, పోలీసులు వినియోగిస్తున్న వాహనాలను, వాటి రికార్డులను పరిశీలించారు.

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని స్టోర్స్ విభాగాన్ని పరిశీలించారు. తదుపరి హోంగార్డ్ కార్యాలయము ను పరిశీలించి హోంగార్డు సిబ్బంది చేస్తున్న విధులపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి పూర్తి వివరాలను తెలుసుకొని వారు సర్వీస్ నందు చేసిన విషయాలను ఒక రికార్డు నందు పొందుపరచాలని సూచించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సిబ్బంది కేటాయించిన విధులలో సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విధులకు అనవసరంగా గైర్హాజరైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

పోలీసు సాయుధ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆయుధాన్ని పూర్తిగా శుభ్రపరుస్తూ ఉండాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులను కేటాయించడం జరుగుతుందని, ఉత్సాహం ఉన్నవారికి సంబంధిత విభాగాలలో విధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సాయుధ పోలీసులు సంసిద్ధంగా ఉంటూ ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని సూచించారు. విధులలో ఎలాంటి సమస్యలున్న, ఇబ్బందులున్న తెలియజేయాలని వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి,  మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు రాకేష్, గోపి, విజయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.