2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

పరీక్షలకు ఏర్పాట్లు

13-03-2026 01:05 AM

కోదాడ, మార్చి 12 : కోదాడ పట్టణంలో ఈనెల 14 నుండి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 1485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 130 మంది సిబ్బందితో, 11 సెంటర్లలో 22 మంది చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి సెంటర్ కి పోలీస్ బందోబస్తు ఉంటుందని, పరీక్ష కేంద్రాల్లో విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్తో పాటు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు.