11-06-2025 01:01:02 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మొహర్రం ఊరేగింపు కార్యక్ర మాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వచ్చే నెల మొదటి వారం లో జరగనున్న మొహర్రం ఊరేగింపుపై మంగళారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీఆర్ అలీతో కలిసి మంత్రి పొన్నం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొహర్రం నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న డైనేజ్, రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.
ప్రధాన ఊరేగింపు ప్రారంభంకానున్న బీకీకా ఆలం పరిసర ప్రాంతాల్లో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆశుర్ఖానాకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ చెప్పారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.