calender_icon.png 15 June, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ పూర్తయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి

11-06-2025 01:01:29 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

హనుమకొండ, జూన్ 10 (విజయ క్రాంతి): భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు పరిహారం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్ట్, పరకాల నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్ట్ ల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్ హైవే, రైల్వే ప్రాజెక్ట్ లకు సంబంధించి కొనసాగుతున్న భూసేకరణ, పరిహారం చెల్లింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రాజెక్ట్ లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తయ్యేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సఖి కేంద్రం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సిద్ధం చేయాలి.

 నూతనంగా నిర్మించిన సఖి కేంద్రం త్వరలోనే ప్రారంభించే విధంగా  ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.  మంగళవారం హనుమకొండ లష్కర్ బజార్ లో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. భవన ప్రాంగణంతోపాటు కార్యాలయ గదులను పరిశీలించారు. భవనంలో కార్యాలయాల ఏర్పాటు, వసతుల కల్పన, తుది దశ పనుల గురించి ఆర్ అండ్ బి ఈ.ఈ సురేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి జయంతిలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను సిద్ధం చేయాలని అన్నారు. ఇప్పుడున్న చోట నుండి నూతనంగా నిర్మించిన భవనంలోకి సఖి కేంద్రాన్ని తరలించాలన్నారు. సఖి కేంద్రానికి వచ్చే మహిళలకు కార్యాలయం గురించి తెలిసే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కోఆర్డినేటర్ హైమావతి, ఆర్ అండ్ బి డీ.ఈ గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం స్ట్రాంగ్ రూముల తనిఖీ

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పటిష్ట భద్రత పర్యవేక్షణలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూములను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి మంగళవారం తనిఖీ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా స్ట్రాంగ్ రూములలో భద్రపరచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

వాటి వివరాలు, రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు ప్రసాదరావు, ఇతర అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇవి శ్రీనివాసరావు, రజనీకాంత్, శ్యాంసుందర్, లక్ష్మణ్, ఎండి. నేహాల్, సయ్యద్ ఫైజుల్లా పాల్గొన్నారు.