3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

వేటగాళ్ల అరెస్టు

07-03-2026 12:00 AM

పెంచికల్‌పేట, మార్చి 6 (విజయక్రాంతి): మండలంలోని అటవీ ప్రాంతం లో కరెంట్ తీగలతో వేటాడిన ఘటనను అటవీ శాఖ అధికారులు వెలుగు లోకి తీసుకొచ్చారు. హోలీ పండుగ సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందికి కాళీమాత గుడి సమీపంలోని పెద్దవాగు ప్రాంతం లో వేట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలో నేరాల్లో పాల్గొన్న అప్పా జీ శ్రీనివాస్ ఇంటిపై పెంచికల్పేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో మార్చి 5న సోదాలు నిర్వహించారు.

సోదాల్లో ఇంట్లో వండిన అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అప్పాజీ శ్రీనివాస్ అతని అన్నలు అప్పాజీ బుచ్చన్న (ఎల్లూరు), అప్పాజీ గణపతి (పెంచిక ల్పేట) కలిసి మార్చి 4న పెద్దవాగు సమీపంలోని చేనులో కరెంట్ తీగలు వేసి అడవి పందిని వేటాడినట్లు తేలిం ది. వేటాడిన మాంసాన్ని మధ్యవర్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అడవి జంతువులను వేటాడడం, వాటి మాంసాన్ని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం అటవీ చట్టం ప్రకారం నేరమని అధికారులు హెచ్చరించారు.