2 May, 2026 | 9:22 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

వేటగాళ్ల అరెస్టు

07-03-2026 12:00 AM

పెంచికల్‌పేట, మార్చి 6 (విజయక్రాంతి): మండలంలోని అటవీ ప్రాంతం లో కరెంట్ తీగలతో వేటాడిన ఘటనను అటవీ శాఖ అధికారులు వెలుగు లోకి తీసుకొచ్చారు. హోలీ పండుగ సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందికి కాళీమాత గుడి సమీపంలోని పెద్దవాగు ప్రాంతం లో వేట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలో నేరాల్లో పాల్గొన్న అప్పా జీ శ్రీనివాస్ ఇంటిపై పెంచికల్పేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో మార్చి 5న సోదాలు నిర్వహించారు.

సోదాల్లో ఇంట్లో వండిన అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అప్పాజీ శ్రీనివాస్ అతని అన్నలు అప్పాజీ బుచ్చన్న (ఎల్లూరు), అప్పాజీ గణపతి (పెంచిక ల్పేట) కలిసి మార్చి 4న పెద్దవాగు సమీపంలోని చేనులో కరెంట్ తీగలు వేసి అడవి పందిని వేటాడినట్లు తేలిం ది. వేటాడిన మాంసాన్ని మధ్యవర్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అడవి జంతువులను వేటాడడం, వాటి మాంసాన్ని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం అటవీ చట్టం ప్రకారం నేరమని అధికారులు హెచ్చరించారు.