29 July, 2026 | 9:55 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

పారమితలో కనువిందు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్

15-11-2025 12:57 AM

ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆర్ట్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కనువిందు చేసింది. పారమిత విద్యాసంస్థ ల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. 6 నుండి 10 వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులచే చిత్రించబడిన దాదాపు 700 కి పైగా కళాకృతులను ప్రదర్శించారు.

ఈ కళాకృతులలో ముఖ్యంగా మహిళా సాధికారత, ప్రకృతి, పర్యావరణం, వివిధ అంశాలపై వేసిన పెన్సిల్ స్కెచ్ లు, పెయింటింగ్ లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రష్మిత , వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంత రావు , ప్రిన్సిపాల్ గోపికృష్ణ, సమన్వయ కర్తలు నాగరాజు, రాము, ఆర్ట్ టీచర్ అజింక్యా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.