6 July, 2026 | 1:12 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

సహాయ మంత్రిగా.. కాదు కాదు ..మంత్రిగా

09-07-2024 02:26 AM

రాష్ట్ర మంత్రికి బదులు.. సహాయ మంత్రిగా అని ఉచ్ఛారణ

మధ్యప్రదేశ్, జూలై 8 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్‌నివాస్ రావత్ ఇటీవల అధికార బీజేపీలో చేరగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేబినేట్‌లో చోటు కల్పించింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన ప్రమాణ స్వీకా రం సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. గ వర్నర్ మంగుభాయ్ సమక్షంలో రావత్ ప్రమాణ స్వీకారం చేస్తూ.. రాష్ట్ర మంత్రికి బదులుగా.. రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని తప్పుగా ఉచ్ఛరించారు. ఈ విషయం అక్కడ గందరగోళానికి తెరలేవడంతో చీఫ్ మినిస్టర్ యాదవ్ సూచన మేరకు గవర్నర్ మంగుభాయ్.. రావత్‌తో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి..

మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత రామ్‌నివాస్ రావత్ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి రా్రష్ట్రంలోని సీఎం యాదవ్ ఆధ్యర్యంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించింది. ప్రస్తుతం ఆయనతో కలిపి రాష్ట్రంలోని కేబినేట్ మంత్రుల సంఖ్య 32కి చేరింది.