సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం
06-07-2026 01:06 PM
దమ్మపేట, జూలై 06(విజయక్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొర మాతృమూర్తి అకాల మరణం చెందడంతో ఆమె పార్థివదేహానికి అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎం ఎల్ ఏ తాటి వెంకటేశ్వర్లు నివాళులర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరను పరామర్శించిన వారిలో మాజీ జేపీటీసీ పైడి వెంకటేశ్వరావు, మాజీ సొసైటీ చైర్మన్, రావు జోగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు రావు శ్రీధర్, పిట్టల రాంబాబు, సీకే నాగార్జున, యార్లగడ్డ ఈశ్వర్, చామర్తి సాయి ప్రసాద్ శాస్త్రి, చిక్కాల శ్రీను, ఉదయగిరి శివ తదితరులు ఉన్నారు.






