calender_icon.png 4 June, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడి పీడన ఉన్నంతవరకు ఎర్రజెండాల రెపరెపలు ఉంటాయి

31-05-2025 08:33:23 PM

నక్సలిజాన్ని వామపక్షాన్ని అంతం చేయడం. ఎవరికి సాధ్యం కాదు..

నరేంద్ర మోడీ పరిపాలనపై సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి ధ్వజం

సుల్తానాబాద్ (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సుల్తానాబాద్ మండల నాలుగవ మహాసభను కనుకుల గ్రామంలో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కడారి సునీల్(CPI District Executive Committee Member Comrade Kadari Sunil) అధ్యక్షతన ఘనంగా నిర్వహించరు. మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నాయకులు మాజీ శాసనసభ ఫ్లోర్ లీడర్  చాడ వెంకటరెడ్డి,సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం హాజరయ్యారు.  అరుణ పతాకాన్ని  సిపిఐ జాతీయ నాయకులు  చాడ వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. 

అమరవీరులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించరు. మహాసభ ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఈ దేశంలో దోపిడీ పీడన వ్యవస్థ ఉన్నంతకాలం నక్సలి జాన్ని వామపక్షాన్ని అంతం చేయడం నిర్మూలించడం ఎవరికి సాధ్యపడదని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న నరహంతక ఫాసిస్ట్ రాక్షస విధానాన్ని తీవ్రంగా ఖండించారు. నక్సలిజాన్ని వామపక్షాన్ని అంతం చేయడానికి ముందు. వారు ఏ ఆశయ సాధన కోసం ఏ సమసమాజ సాధన కోసం దశాబ్దాల కాలం నుంచి పోరాటం చేస్తున్నారో ముందు ఆ సమస్యలు నిర్మూలించండి అని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హితవు చెప్పారు.

కార్మికులు కర్షకులు పీడత తాడిత ప్రజానీకానికి కమ్యూనిస్టు పార్టీ అండగా పోరాటాలు చేస్తుందని 100 సంవత్సరాలు దాటి అమరులు అందించిన ఆశయ సాధన కొరకై పోరాటాలు చేస్తూనే ఉంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్యారంటీలను అమలు చేయకపోతే ఇబ్బందులు ప్రభుత్వానికి ఎదురు కాక తప్పదని ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో అనవసరపు అడ్డగోలు కొరీలు పెట్టి దాటవేయడం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు.ఈ మహాసభలో పూసల రమేష్ మినుగు సధాకర్,వెంకటేష్,రాజమల్లు, పెరిక కనకయ్య, జెట్టి సంపత్, బొజ్జ రవి, బొజ్జ సతీష్,మర్రి రాజు, సొల్లురి శ్రీనివాస్, సుఖ మల్లయ్య,శారద,లక్ష్మి,కేతమ్మ, కొమురక్క,కనకమ్మ, 23 గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.