calender_icon.png 6 June, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలి

31-05-2025 08:34:25 PM

డీఎస్పీ ప్రభాకర్

పటాన్ చెరు: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పటాన్ చెరు  డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. శనివారం పటాన్ చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ల లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పటాన్ చెరు, జిన్నారం పోలీస్ స్టేషన్ లలో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశాలకు డీఎస్పీ ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.

మెడికల్ సర్టిఫికెట్ ఉన్న పశువులను మాత్రమే ఈ సందర్భంగా తరలించాలని ఆయన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశాలలో పటాన్ చెరు  సీఐ వినాయక రెడ్డి, జిన్నారం సీఐ నయీముద్దీన్, ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సైలు నాగలక్ష్మి, కోటేశ్వరరావు, సుధాకర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.