ప్రభుత్వ నిర్భందాన్ని నిరసిస్తూ ఆశాల నిరసన...
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఆశలు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): సమస్యల పరిస్కారం కోసం శాంతి యుతంగా ఛలో హైదరాబాద్ కు వెళ్లే ఆశ కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను ఎక్కడికక్కడ నిర్బందించడాన్ని నిరసిస్తూ, ఆశాలపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహానం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు 18 వేల రూపాయల వేతనం పెంచుతామన్న హామీని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుందని విమర్శించారు. మహిళలనే కనీసం సోయి లేకుండా మగ పోలీస్ లతో కొట్టించడం అన్యాయం అన్నారు. ప్రజాపాలన అంటూ నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పోలీస్ లను నమ్ముకొని పరిపాలిస్తున్నదని, అలాంటి ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు అన్న సత్యాన్ని గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల చిన్నన్న, లక్ష్మి, పుష్పలత తదితరులు ఉన్నారు.






