calender_icon.png 20 June, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ కి ఏటీసీ సెంటర్ మంజూరు..

20-06-2025 06:19:42 PM

ముఖ్యమంత్రి రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రణవ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ నియోజకవర్గానికి ఏటీసీ(Advanced Technology Center) మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం విద్యారంగంపై అధిక దృష్టి సారిస్తుందని, సెంటర్ మంజూరు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువతి, యువకులకు ఎంతో గాను ఉపయోగపడుతుందని, గ్రామీణ స్థాయి విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి, ఉద్యోగ కల్పనకు సహాయపడుతుందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో యువత భవిష్యత్తుకు సంబంధించి దృష్టి సారిస్తామని నిరుద్యోగ యువకులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.