calender_icon.png 20 June, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి

20-06-2025 06:34:26 PM

జిల్లా కేంద్రం కోసం త్వరలోనే పాదయాత్ర..

తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఘన విభూతి శ్రీనివాస్..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtబాన్సువాడ నియోజకవర్గంను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా స్థానిక నాయకులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కొందరి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయాలలో ఉన్నత పదవుల కోసం, ఆ సమయాన అధికారంలో ఉన్న పార్టీకి వంగి వంగి దండాలు పెడుతూ, వారికి బానిసలుగా వ్యవహరించిన కొందరు రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం మొత్తం కొత్త జిల్లాలు ఏర్పడుతూ ఉంటే అందులోనూ బాన్సువాడను కూడా జిల్లా కేంద్రంగా చేయాల్సి ఉండగా దానిని జిల్లా కేంద్రంగా కానీయకుండా అడ్డుకున్నారని తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఘన విభూతి శ్రీనివాస్(Praja Sainyam Party State President Ghani Vibhuti Srinivas) పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంగా కనుక చేసి ఉంటే అంతర్ రాష్ట్ర జిల్లాగా బాన్సువాడ మారి చాలా అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. చుట్టుపక్కల పల్లెలకు, మండలాలకు చాలా రకాల అభివృద్ధి పనులు జరిగేవని. కానీ జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకొని, అసలు అభివృద్ధి కాకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుకోవడం జరిగింది అని చెప్పుకొచ్చారు. అందుకే బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలని "తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ" పోరుబాటకు సిద్ధమవుతుందన్నారు. బాన్సువాడను జిల్లా కేంద్రంగా మార్చాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో బాన్సువాడను జిల్లా కేంద్రంగా సాధించుకోవడం కోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, వర్ని , కోటగిరి మండలాల మీదుగా తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ను చెబుతామని అందరం కలిసి జిల్లా కేంద్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.