29-06-2025 01:08:56 AM
వీవీఎస్ఎన్ చౌదరి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): మహా న్యూస్ టీవీ చానెల్ కార్యాలయంపై జరిగిన దాడి సరికాదని, బీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీవీఎస్ఎన్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ప్రోద్బలంతోనే వారి అనుచరులు మహా టీవీ సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు.
కార్యాలయం తలుపులు, కార్లు ధ్వం సం చేసి బీభత్సం సృష్టించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, నాయకులు రవికుమార్ యాదవ్ టీవీ ఛానల్ కార్యాలయాన్ని సందర్శించి, మహా టీవీ సిబ్బందికి భరోసా కల్పించారని చెప్పారు.