15 June, 2026 | 3:17 PM

Breaking News

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •  

కాసిపేట మండలంలో యువతిపై దాడి

25-03-2026 09:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామంలో ఓ మహిళపై ప్రేమ వివాహం విషయంలో తలెత్తిన విభేదాలు దాడికి దారితీసిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం... రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల అక్షిత్ కుమార్, అదే గ్రామానికి చెందిన అలక అక్షిత ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయా రు. రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారునీ సమాచారం.. దీన్ని మనసులో పెట్టుకొని అక్షిత్ కుమార్ సోదరి సదాపై అమ్మాయి అలక పెద్దులు, రాజు, ప్రశాంత్ వారి బందువులు కలిసి దాడి చేసి కొట్టారు. ఈ సంఘటనలో గాయపడిన సదాను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.