29 March, 2026 | 5:14 PM

నిందితులను కఠినంగా శిక్షించాలి

29-03-2026 03:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో హిందులపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాల పట్ల సదరు నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. పట్టణంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిన్న నిర్మల్ బంద్ కు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిస్తే,  పట్టణంలో బంద్ కొనసాగుతుండగానే  పట్టణంలోని సోఫీ నగర్ లో నిన్న కొందరు మైనార్టీ వర్గానికి చెందిన దుండగులు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్య, అత్యాచారానికి గురైన  మైనర్ బాలిక కుటుంబ సభ్యులను నేడు బీజేపీ నాయకులు పరామర్శించారు.

నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండే విధంగా, ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా నిందితులను శిక్షించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పట్టణ బీజేపీ నాయకులు వోడ్నల రాజు, తో పాటు హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.