27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

సీపీగెట్ పరీక్షలకు 88.31% హాజరు

18-07-2024 01:16 AM

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఈనెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన కామన్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షల (సీపీగెట్)కు 88.31 శాతం మంది హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.ఐ.పాండురంగా రెడ్డి తెలిపారు. 45 సబ్జెక్టులకు సంబంధించి 73,342 మంది దరఖాస్తు చేసుకుంటే, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. మూడు సెషన్‌లలో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీతో పరీక్షలు ముగియగా, బుధవారం వాటి వివరాలను అధికా రులు వెల్లడించారు.