27 July, 2026 | 7:00 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

27-07-2026 06:30 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇంట్లో గత 24వ తేదీన దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కృష్ణ కాంత్ జాదవ్ను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు బోత్ ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. ఈనెల 24న బాధితురాలు ఇంటికి తాళం వేసి బయట పని నిమిత్తం వెళ్లిపోయిందని అయితే విషయం గమనించిన నిందితుడు తాళం పగలగొట్టి 5000 రూపాయల నగదు దొంగతనానికి పాల్పడ్డట్టు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఈనెల 26న దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. తనకు కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనానికి పాల్పడ్డట్టు ఒప్పుకోవడం జరిగిందన్నారు. వద్దనుండి 5000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై వి పురుషోత్తం పేర్కొన్నారు