27 July, 2026 | 12:53 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ఏయూ రీసెర్చ్ స్కాలర్ సామేల్ మాథారికి పిహెచ్డి పట్టా

23-02-2026 08:37 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్  సమేల్ మాథారి తన విశిష్ట పరిశోధన గ్రంథం హైపర్ ట్యూన్డ్ ఎఫీషియండ్ యూరప్ నెట్వర్క్ ఫర్ ఇమేజ్ జరీడి సెక్షన్ కు ఈనెల 21న అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెచ్-బ్లాక్, 4వ అంతస్తు, కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను అందుకున్నారు.

ఈ డాక్టరల్ పరిశోధనను డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి విశిష్ట పర్యవేక్షణ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆయన అందించిన నిపుణులైన మార్గనిర్దేశం, దూరదృష్టి గల విద్యా నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం ఈ ఉన్నతమైన  ప్రభావవంతమైన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి.