26 April, 2026 | 9:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మల్లన్న ఆలయంలో వేలం పాట

29-07-2025 02:07 AM

ఆలయానికి రూ. 13 లక్షల ఆదాయం 

చేర్యాల, జులై 29:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సీల్ కం  బహిరంగ వేలం పాట లు నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముకొని లైసెన్ హక్కు పొందడానికి వేలంపాట నిర్వహించారు. ఇప్పటికే పలు ద పాలు వేలంపాట నిర్వహించినప్పటికీ సరైన పాట రాకపోవడంతో అనేకమార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు వేలం పాటను పూర్తి చేశారు. 

ఈ వేలం పాటలో అయినా పూర్ గ్రామానికి చెందిన  మల్లం శ్రీనివాస్ 13 లక్షలు పాట పాడి టెండర్ను దక్కించుకున్నారు. ఈ వేలం పాటతో ఆలయానికి సంబంధించిన అన్ని వేలం పాటలు పూర్తయ్యాయి. వేలం పాట పాడిన వారు వచ్చే నెల ఒకటో తారీకు నుంచి సంవత్సరం పాటు  షాపును  నిర్వహించుకోవడం జరుగుతుంది.

ఈ వేలం పాటలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి అన్నపూర్ణ, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, శ్రీరాములు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.