calender_icon.png 29 July, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో వేలం పాట

29-07-2025 02:07:08 AM

ఆలయానికి రూ. 13 లక్షల ఆదాయం 

చేర్యాల, జులై 29:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సీల్ కం  బహిరంగ వేలం పాట లు నిర్వహించారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముకొని లైసెన్ హక్కు పొందడానికి వేలంపాట నిర్వహించారు. ఇప్పటికే పలు ద పాలు వేలంపాట నిర్వహించినప్పటికీ సరైన పాట రాకపోవడంతో అనేకమార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు వేలం పాటను పూర్తి చేశారు. 

ఈ వేలం పాటలో అయినా పూర్ గ్రామానికి చెందిన  మల్లం శ్రీనివాస్ 13 లక్షలు పాట పాడి టెండర్ను దక్కించుకున్నారు. ఈ వేలం పాటతో ఆలయానికి సంబంధించిన అన్ని వేలం పాటలు పూర్తయ్యాయి. వేలం పాట పాడిన వారు వచ్చే నెల ఒకటో తారీకు నుంచి సంవత్సరం పాటు  షాపును  నిర్వహించుకోవడం జరుగుతుంది.

ఈ వేలం పాటలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి అన్నపూర్ణ, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, శ్రీరాములు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.