08-06-2025 12:03:03 AM
బిడ్డ దుర్మరణం, తల్లికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్, జూన్ 7 (విజయ క్రాంతి) : మహబూబాబాద్ మరిపెడ జాతీ య రహదారిపై కురవి మండలం లింగ్య తండ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిడ్డ దుర్మరణం చెం దగా, తల్లి , ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
కురవికి చెందిన తోడుసు సరిత తన కూతురు స్నేహశ్రీ (15) ని మహబూబాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లి నేత్ర పరీక్ష చేయిం చి కంటి అద్దాలు తీసుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను మరిపెడ నుంచి మహబూబాబాద్ వైపు వస్తున్న లేలాండ్ అండ్ ట్రాలీ ఢీకొట్టడంతో స్నేహశ్రీ అక్కడికక్కడే మరణించగా తల్లి సరిత తీవ్రంగా గాయపడింది.
ఆమెతో పాటు ఆటో డ్రైవర్ కానుగంటి రాజు కూడా గాయాలు పాలు కాగా మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యాలయంలో చేర్పించడానికి స్నేహశ్రీ కి కొత్త దుస్తులు, పాఠ్యపుస్తకాలు కూడా ఇప్పించి రెండు రోజుల్లో కళాశాలలో చేర్పించాల్సిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించ డంతో తీవ్ర విషాదం నెలకొంది.