08-06-2025 12:01:21 AM
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు గత కొన్నేళ్లుగా కొత్తగా పెట్రోల్, డీజిల్ ఆటోలకు అనుమతులు ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఓఆర్ఆర్ లోపల 40 వేల కొత్త ఆటో రిక్షాల అనుమతిని సడలిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తూ ఆదేశాలు- ఇచ్చినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో గత కొంతకాలంగా కొత్త పరిమితి ఉండటంతో కొత్త ఆటో రిక్షాలకు పరిమితులు ఇచ్చేందుకు ఆస్కారం లేదని..
ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 263 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన శనివారం మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ‘నగరంలో పెరిగిన జనాభాతో ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియం త్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి, ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభు త్వం భావించింది. అందుకే ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్, 10 వేల ఎల్పీజీ, 10 వేల సీఎన్జీ ఆటో రిక్షాలకు అనుమతి ఇచ్చింది’ అని మంత్రి వివరించారు.
అలాగే డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ (ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలుగా మార్పు) ఆటోలుగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేశారు.
ఇప్పటివరకు ఉన్న డీజిల్ ,పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్స్ఫర్, డీజిల్ పెట్రోల్, కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతి లేదని మంత్రి ప్రకటిం చారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా దాదా పు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి తెలిపారు.