కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన
కరీంనగర్, మార్చి 11 (విజయక్రాంతి): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆ ధ్వర్యంలో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా.రామ్ చందర్ మాట్లాడుతూ.. ‘మధుమేహం, బీపీ ఉన్న వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం, ఉప్పు, ప్రాసె స్డ్ ఆహారాన్ని తగ్గించడం ద్వారా కిడ్నీ వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు అని తెలిపారు.
మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ.. ‘ప్రజల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచ డం అత్యంత అవసరం. ముందస్తు పరీక్షలు, సరైన చికిత్సతో కిడ్నీ సమస్యలనుని యంత్రించవచ్చు. మెడికవర్లో ఆధునిక సాంకేతి కతతో నిపుణుల బృందం కిడ్నీ సంబంధిత చికిత్సలను అందిస్తోంది’ అని తెలిపారు.




