calender_icon.png 25 June, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

25-06-2025 12:35:46 AM

అలంపూర్ సీఐ రవిబాబు

గద్వాల, జూన్ 24 ( విజయక్రాంతి ) : అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అలంపూర్ సీఐ రవిబాబు అవగాహన కల్పించారు. మంగళవారం పట్టణం లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం తో పాటు సీఐ ప్ర తిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా అలంపూర్ సీఐ రవిబాబు మాట్లాడుతూమాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనుకబడేలా చేస్తాయన్నారు. భవిష్యత్తును నాశనం చేస్తాయని వివరించారు.

కాబట్టి, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైతే ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరన్నారు.