10-10-2025 03:12:47 PM
విద్యార్థులకు అవగాహన...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): పొగాకు వాడకం ప్రమాదకరం అని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటు, పొగాకు రహిత యువత కోసమే ప్రచారంలో భాగంగా స్థానిక బాలక్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2 లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడకం మూలంగా కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమని సూచించారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.