10-10-2025 02:33:51 PM
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల(Jubilee Hills by election) సమన్వయ సమావేశంలో భాగంగా భాగ్యనగరంలోని ఎనిమింది జిల్లాల ప్రధాన నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, బూత్ స్థాయి సమన్వయం వంటి కీలక అంశాలపై గ్రేటర్ పరిధి జిల్లాల నాయకులకు అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandra Rao) దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అరాచకమే పరాకాష్టకు చేరిందన్నారు. ఈ రెండు పార్టీల వైఫల్యాల వలన విసుగుచెందన ప్రజలు ఇప్పుడు బీజేపీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించగల శక్తి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.