12-06-2025 05:12:48 PM
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన..
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): 14 ఏళ్ల లోపు చిన్నారులు పనిలో కాకుండా బడిలో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నసీం సుల్తానా(District Judge Naseem Sultana) అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పటంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై ఫిర్యాదు చేయవచ్చునని అందుకు టోల్ ఫ్రీ నెంవర్ 1098 అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు, పుస్తకాలు, యూనిఫార్ములు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అడ్వకేట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.