12-06-2025 05:18:32 PM
బస్సు కిందపడి యువకుడు మృతి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): విజయవాడ హైవే(Vijayawada Highway) నార్కెట్ పల్లి త్రిపుర హోటల్ ఎదుట గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిజాంబాద్ వెళ్లే బస్సు టైరు కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు మిర్యాలగూడ వాసిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు ఇద్దరు యువకులు తమ యాక్టివా వాహనంపై వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు ఆమీర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరొక యువకుడు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాద స్థలానికి నార్కెట్ పల్లి ఎస్సై క్రాంతి కుమార్(SI Kranthi Kumar) చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.