15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

06-01-2026 12:00 AM

‘మేరా లాగిన్ - మేరా రూల్’ థీమ్‌తో కార్యక్రమం

మేడిపల్లి, జనవరి 5(విజయక్రాంతి): రాష్ట్ర  డీజీపీ  ఆదేశాల మేరకు సోమవారం మేడిపల్లి పోలీసులు అరోరా పీజీ కాలేజ్ బోడుప్పల్ ఆధ్వర్యంలో 300 మంది కాలేజీ విద్యార్థుల తో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు వారాల కార్యక్రమంలో ఐదవ వారంలో ‘మేరా లాగిన్-మేరా రూల్ ’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ భద్రత, మోసాలు జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి , ఏసీపీ శివ శంకర్, ఇన్‌స్పెక్టర్ మాధవి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.