17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నిరుపేద కుటుంబానికి ‘జై భీమ్ యూత్’ బియ్యం పంపిణీ

06-01-2026 12:00 AM

నూతనకల్, డిసెంబర్ 5: మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన ఇరుగు ముత్తమ్మ  ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో, ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న జై భీమ్ యూత్ కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.

ముత్తమ్మ గారి దశదిన కర్మ సందర్భంగా సోమవారం వారి కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించేందుకు కమిటీ సభ్యులు అర క్వింటా బియ్యం విరాళంగా అందజేశారు.కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.  జై భీమ్ యూత్ సభ్యులు నాయకపు నాగరాజు, కొమ్ము సురేష్, ఇరుగు సతీష్, ఆంజనేయులు తదితరులున్నారు.