అసంక్రమిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం
మఠంపల్లి,(విజయ క్రాంతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలో అసంక్రమిత వ్యాధులు (Non-Communicable Diseases- NCDs)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య,మఠంపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కళ్యాణి హాజరై మాట్లాడుతూ... అసంక్రమిత వ్యాధులు (మధుమేహం, రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు వంటి) గురించి అవగాహన కల్పించి,వాటి నివారణకు సరైన ఆహారం, వ్యాయామం,ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ముఖ్యమైన సూచనలు తెలియాజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శౌరి,సూపర్వైజర్లు ఏ.రవికుమార్ , కళావతి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు,సిబ్బంది, ఎఎన్ఎమ్,ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




