07-06-2025 02:14:34 AM
మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి
తూప్రాన్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల శుభ్రత ప్రణాళిక అమలు పరిచే క్రమంలో తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో తడి పొడి చెత్తపై మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి అవగాహన కల్పించారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సూచి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఇందులో భాగంగా మంచి నీళ్లలో క్లోరినైజేషన్ చేసి పరీక్షలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ మంచినీటి నల్ల కనెక్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్నుల విషయంలో మొండి బకాయిలు ఉన్న వారికి నోటీసులను, ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణదారులకు ట్రేడ్ అనుమతులను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రిషికేశవ్, శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బందిఉన్నారు.